ఆంధ్రప్రదేశ్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని వాయిదా వేసిన ప్రభుత్వం
By: chandrasekar Tue, 14 July 2020 10:10 AM
కరోనావైరస్ ఉధృతి కారణంగా
ఆంధ్రప్రదేశ్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ
సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలన్నీంటిని వాయిదా వేస్తున్నట్లు
మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు
వెల్లడించారు. అయితే కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ను ఇప్పటికే విడుదలచేశామని, దీనిపై
సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
సెప్టెంబరు మూడో వారానికి
ఈ ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.
అయితే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని
మంత్రి తెలిపారు.
జాతీయ పరీక్షలకు ఆటంకం
కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆన్లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలోనే
ప్రకటిస్తామని ఆయన తెలిపారు.