Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని వాయిదా వేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని వాయిదా వేసిన ప్రభుత్వం

By: chandrasekar Tue, 14 July 2020 10:10 AM

ఆంధ్రప్రదేశ్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని వాయిదా వేసిన  ప్రభుత్వం


కరోనావైరస్ ఉధృతి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలన్నీంటిని వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదలచేశామని, దీనిపై సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

సెప్టెంబరు మూడో వారానికి ఈ ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. అయితే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

జాతీయ పరీక్షలకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆన్‌లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Tags :

Advertisement