Advertisement

జూమ్ వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్

By: chandrasekar Mon, 16 Nov 2020 8:41 PM

జూమ్ వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్


కరోనా వల్ల జూమ్ యాప్ ను వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కానీ వీడియో కాలింగ్ యాప్ జూమ్ తమ వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది. ‘థ్యాంక్స్ గివింగ్’ రోజైన ఈ నెల 26న అర్ధరాత్రి నుంచి తర్వాతి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు కాల్స్ విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, అపరిమితంగా మాట్లాడుకోవచ్చని తెలిపింది. వీడియో కాలింగ్‌పై ప్రస్తుతం ఉన్న 40 నిమిషాల పరిమితిని ఆరోజున ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది.

దేశ వ్యాప్తంగా థ్యాంక్స్ గివింగ్ రోజున తమ కుటుంబ సభ్యులతో నచ్చినంత సేపు మాట్లాడుకోవచ్చని తెలిపింది. కరోనా వైరస్ సమయంలో ‘జూమ్’ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాదాపు సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించడంతో మీటింగ్‌ల కోసం జూమ్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. అలాగే, విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులకు జూమ్ వినియోగం పెరిగింది. కానీ ఇందుకోసం ఉచిత కాలింగ్ 40 నిమిషాలకు పరిమితం చేసింది.

మాములుగా అయితే ఆ సమయం ముగిసిన తర్వాత కాల్ కట్ అయిపోతుంది. మళ్లీ కాల్ చేయాలనుకుంటే కనుక నిర్ణీత సమయం వరకు ఆగాల్సి వచ్చేది. గూగుల్ మీట్ సహా జూమ్ ప్రత్యర్థులు కూడా ఇలాంటి ఆంక్షలే విధించారు. అయితే, జూమ్‌తో పోలిస్తే ఈ నిడివి కాస్త ఎక్కువ. గూగుల్ మీట్‌లో 60 నిమిషాల పరిమితి ఉంది. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవాలనుకుంటే ప్లాన్లకు అనుగుణంగా రుసుము వసూలు చేస్తున్నాయి. ఈ ఆఫర్ వల్ల ఉచితంగా ఎక్కువసేపు వీడియో కాల్స్ ను వినియోగించుకోవచ్చు.

Tags :
|
|

Advertisement