Advertisement

గుడ్ న్యూస్: తగ్గిన బంగారం.. పెరిగిన వెండి

By: Anji Mon, 31 Aug 2020 08:26 AM

గుడ్ న్యూస్: తగ్గిన బంగారం.. పెరిగిన వెండి

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,580కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,120కు పడిపోయింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.66,350కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 1982 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1.62 శాతం పెరుగుదలతో 28.25 డాలర్లకు చేరింది.


ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Tags :

Advertisement