Advertisement

Breaking News: ఇక శాశ్వతంగా ఇంటినుంచే...!

By: Anji Mon, 14 Dec 2020 1:30 PM

Breaking News: ఇక శాశ్వతంగా ఇంటినుంచే...!

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులు ఇంట్లో నుంచి పని చేసుకునే సౌలభ్యం కల్పించాయి.

కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను దశల వారీగా ఆఫీసులకు రమ్మని సూచిస్తున్నాయి.

కాగా మరికొన్ని సంస్థలు మాత్రం ఇన్ఫెక్షన్ ముప్పుతో సంబంధం లేకుండా.. తమ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ చేసేలా ఆఫర్ ఇస్తున్నాయి.

ఇంట్లో నుంచి పని చేస్తున్నప్పటికీ.. ఉత్పాదకత తగ్గకపోగా.. మరింత పెరగడంతో కొన్ని రంగాలకు చెందిన సంస్థలు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఉద్యోగులు రోజూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని.. ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని సీఐఐ-ఎఫ్ఎంసీజీ సదస్సులో రెకిట్ బెన్‌కిసెర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు. రెకిట్ బెన్‌కిసెర్‌ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 40 వేల మందికిపైగా పని చేస్తున్నారు.

ఉదయం 9 గంటలకు పని మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకు ముగించడం అనేది ఇక గతమని బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ వరుణ్ బెర్రీ వ్యాఖ్యానించారు. ఏదో ఒక దశలో వర్క్ ఫ్రమ్ మళ్లీ తిరిగొస్తుందన్నారు.

రెకిట్ బెన్‌కిసర్, బ్రిటానియా అమ్మకాలు కరోనా సమయంలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నెల రోజుల తర్వాత వాటి ఉత్పత్తి సామర్థ్యం 100 శాతానికి చేరుకుంది.

వర్క్‌ఇన్‌సింక్ అనే టెక్ సొల్యూషన్స్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. మార్చితో పోలిస్తే నవంబర్ చివరి నాటికి కేవలం పది శాతం మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు.

కోకా-కోలా ఇండియాకు అతిపెద్ద బాటిలింగ్ పార్టనర్ అయిన హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజెస్‌లో 6500 మంది ప్రత్యక్ష ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంట్లో నుంచే పని చేస్తున్నారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల్లో చాలా మందిని మార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించాయి. ఫ్లిప్‌కార్ట్ 12 వేల మంది ఉద్యోగులకు వచ్చే ఏడాది మే వరకు వర్క్ ఫ్రమ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Tags :

Advertisement