Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...!

By: Anji Sun, 01 Nov 2020 5:33 PM

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...!

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర స్వామివారి ఆల‌యంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది.

కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా మార్గదర్శకాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, స‌హ‌స్ర ‌దీపాలంకార‌ సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవ‌గా న‌వంబ‌రె రెండో వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేప‌ట్టింది.

ఈ సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి దర్శనం ఉండ‌దు. దర్శనం పొంద దలచిన గృహ‌స్తులు శ్రీ‌వారి దర్శనం కోసం ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైలో పొందాల్సి ఉంటుంది. ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.

Tags :

Advertisement