Advertisement

జగన్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్

By: chandrasekar Thu, 06 Aug 2020 5:27 PM

జగన్ ప్రభుత్వానికి  గుడ్ న్యూస్


ఆంధ్ర ప్రదేశ్ రాజధాని, మూడు రాజధానుల అంశం మరో మలుపు తిరిగింది. రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్ర పరిధిలోనిదా రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై కేంద్రం హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలోని అంశమని కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కౌంటర్ ఇచ్చింది. చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తెలిపింది.

Tags :
|
|
|

Advertisement