Advertisement

  • తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌కు శుభ‌వార్త

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌కు శుభ‌వార్త

By: chandrasekar Wed, 04 Nov 2020 7:06 PM

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌కు శుభ‌వార్త


ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజరుకాని 27,589 మంది విద్యార్థుల‌ను గ్రేస్ మార్కుల‌తో పాస్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

వీరిలో మాల్ ప్రాక్టీస్ క‌మిటీ బ‌హిష్క‌రించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కరోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మార్చిలో జ‌రిగిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా గ్రేస్ మార్కుల‌తో పాస్ చేసిన విష‌యం తెలిసిందే.

Tags :
|

Advertisement