Advertisement

  • సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన యాజమాన్యం

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన యాజమాన్యం

By: Sankar Tue, 13 Oct 2020 5:25 PM

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన యాజమాన్యం


సింగ‌రేణి కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎండీ ఎన్ శ్రీ‌ధ‌ర్‌.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మిన‌హాయించిన జీతాల‌తో పాటు.. సింగ‌రేణి లాభాల్లో బోన‌స్‌ను కూడా ఇవ్వ‌నున్నారు..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణిలో లాభాల బోనస్‌ 28 శాతం ఈ నెల 23వ తేదీన చెల్లిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ ప్రక‌టించారు.. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు 993.86 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు దీనిలో 28 శాతం అనగా 278.28 కోట్ల రూపాయలను సంస్థలోని ఉద్యోగులకు ఈ నెల 23వ తేదీన పంపిణీ చేయ‌నున్నారు..

సగటున ఒక్కో కార్మికుడికి రూ.60,468 లాభాల బోనస్‌ లభించే అవకాశం ఉంది.. ఇక‌, కరోనా నేపథ్యంలో మార్చి 2020 జీతాల్లో మినహాయించిన జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్‌ తో పాటు కలిపి 23వ తేదీనే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయ‌నున్నారు.. మ‌రోవైపు... దసరా పండుగ అడ్వాన్సు సొమ్మును ఒక్కొక్కరికి 25 వేల రూపాయలను ఈ నెల 19వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో వేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎండీ శ్రీధర్.

Tags :

Advertisement