Advertisement

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త...!

By: Anji Tue, 15 Dec 2020 2:42 PM

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త...!

కరోనా కారణంగా.... ఇంటర్ విద్యామండలి ఆరు రకాల ఫీజులను రద్దు చేసింది. రీ-అడ్మిషన్, మొదటి ఏడాది తర్వాత టీసీతో మరో కళాశాలలో ప్రవేశం,

మొదటి ఏడాదిలో రెండో భాష, మాధ్యమం, గ్రూపు మార్పు, రెండో ఏడాదిలో గ్రూపు మార్చుకునేందుకు.. ఎలాంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

ఈ వెసులుబాటు ఈ ఏడాదికేనని....విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే చాలామంది విద్యార్థులు బోర్డుకు ఫీజులను చెల్లించారు. వీటిపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కొవిడ్ కారణంగా.... ఈ ఏడాదికి ఆరు రకాల ఫీజులను రద్దు చేస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బోర్డుకు ఫీజులను చెల్లించారు. వీటిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

Advertisement