Advertisement

కేంద్రం చెరుకు రైతులకు శుభవార్త...

By: chandrasekar Wed, 16 Dec 2020 9:23 PM

కేంద్రం చెరుకు రైతులకు శుభవార్త...


కేంద్రం పంచదార ఎగుమతులపై రాయితీ ప్రకటించడ౦తో పది కోట్ల మంది వరకు రైతులకు లాభం రాబోతోంది. బుధవారం ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 60 లక్షల టన్నుల పంచదారపై రూ.3500 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

టన్నుకు రూ.6 వేల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో సుమారు ఐదు కోట్ల మంది రైతులు, ఐదు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని, రాయితీ నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశ అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్‌, రవి శంకర్‌ ప్రసాద్‌ మీడియాకు తెలిపారు.

Tags :
|
|

Advertisement