Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ విద్యార్థుల‌కు శుభ వార్త

ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ విద్యార్థుల‌కు శుభ వార్త

By: chandrasekar Tue, 26 May 2020 3:02 PM

ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ విద్యార్థుల‌కు శుభ వార్త


కరోనా కార‌ణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ నష్టపోకుండా ఉండేందుకు ఐఐటీ, నిట్ లు బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నాయి. లాక్‌డౌన్ ‌వలన ఇళ్ల వద్దనున్న స్టూడెంట్స్ అక్కడి నుంచే ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో ఆల‌స్యం జరిగితే ప్లేస్మెంట్స్ పొందిన‌వారు, ఉన్నత చ‌దువుల‌కు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.

అందువలన ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కు ఐఐటీ తిరుపతి, తాడేపల్లిగూడెం నిట్ స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. తాడేపల్లిగూడెం నిట్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనుంది.

కాలేజీల్లో నిర్వహించిన మిడ్‌, మైనర్ ఎగ్జామ్స్ కు 75% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్ పెడ‌తారు. దీనిలో జంబ్లింగ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వబడతాయి. స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే క్వ‌చ్చ‌న్ పేప‌ర్ డౌన్‌లోడ్‌ అవుతుంది.

good,news,btech,students,andhra pradesh ,ఆంధ్రప్రదేశ్, బీటెక్, విద్యార్థుల‌కు, శుభ వార్త, కరోనా


ఈ కెమెరా స్టూడెంట్ ను పరిశీలిస్తూ ఉంటుందని అకడమిక్‌ డీన్‌ బీఆర్‌కే శాస్త్రి తెలిపారు. రెండు, మూడో సంవత్సరం స్టూడెంట్స్ కు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.ఐఐటీ తిరుపతిలో క్వ‌చ్చ‌న్స్, ఆన్స‌ర్స్ రూపంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇవి జూన్ ఫ‌స్ట్ వీక్ లో ప్రారంభం కానున్నాయి.

కరోనా కారణంగా స్టూడెంట్స్ ఒకచోటకు వచ్చి ఎగ్జామ్స్ రాసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐఐటీ తిరుపతి సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.ఫైన‌ల్ ఇయ‌ర్ సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులకు ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు కేటాయించ‌రు. స్టూడెంట్స్ జవాబులను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి వస్తున్నందున కొంచెం ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌బడుతుంది. విద్యార్థుల కదలికలను కంప్యూటర్‌లోని కెమెరా ద్వారా మానిటర్ చేయగలరు.

Tags :
|
|
|

Advertisement