Advertisement

  • అనంతపురం జిల్లా వాసులకు వైఎస్‌ జగన్‌ తీపికబురు...!

అనంతపురం జిల్లా వాసులకు వైఎస్‌ జగన్‌ తీపికబురు...!

By: Anji Wed, 09 Dec 2020 10:23 AM

అనంతపురం జిల్లా వాసులకు వైఎస్‌ జగన్‌ తీపికబురు...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా వాసులకు ఇచ్చిన మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు జిల్లాలో ఇవాళ మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేశారు..

రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఈ రిజర్వాయర్ల ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది.

జగన్ మాట ఇస్తే తప్పరని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విజన్‌ ఉన్న నాయకుడని, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని తమ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

Tags :

Advertisement