Advertisement

  • Breaking: మట్టి దిబ్బలో బంగారు నాణేలు... కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్...!

Breaking: మట్టి దిబ్బలో బంగారు నాణేలు... కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్...!

By: Anji Sun, 11 Oct 2020 09:24 AM

Breaking: మట్టి దిబ్బలో బంగారు నాణేలు... కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్...!

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మట్టిదిబ్బలో బంగారు నాణేలు బయటపడటం సంచలనం రేపింది. కుప్పం సరిహద్దులో తమిళనాడుకు చెందిన హోసూర్‌ సమీపంలో రోడ్డు పక్కనే మట్టిదిబ్బలో బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు జనాలు ఎగబడ్డారు.

ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడి చేరుకున్నారు. బంగారు నాణేల కోసం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. బంగారం కోసం జనాలు భారీగా చేరుకోవడంతో హోసూరు- బాగలూర్‌ హైవేపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. ప్రజలకు దొరికిన బంగారు నాణెం ఒక్కొక్కటి 2 గ్రాములు ఉంటుందని సమాచారం.

బంగారం కోసం జనాలు భారీగా చేరుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మట్టిదిబ్బలోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసుల విచారణ ప్రారంభించారు.

Tags :

Advertisement