Advertisement

  • శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి సన్నధిలో మరోసారి బయటపడ్డ బంగారం, వెండి నాణాలు

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి సన్నధిలో మరోసారి బయటపడ్డ బంగారం, వెండి నాణాలు

By: chandrasekar Mon, 05 Oct 2020 3:12 PM

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి సన్నధిలో మరోసారి బయటపడ్డ బంగారం, వెండి నాణాలు


శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి సన్నధిలో మరోసారి బంగారం, వెండి నాణాలు బయటపడ్డపడ్డాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం సన్నధిలో మరోసారి బంగారం, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టె లభించింది. అది తెలిచి చూడగా అందులో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది. బయటపడ్డ ఈ నాణేల వెనుక పెద్ద చరిత్రే ఉన్నట్లు భావిస్తున్నారు. లభ్యమైన ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటికి చెందినవిగా ఉన్నాయి. బంగారు నాణేలు లభించాయన్న సమాచారం అందుకున్న ఆలయ ఈవో కేఎస్‌ రామారావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు.

ఈ విధంగా ఆలయంలో బంగారు నాణేలు బయటపడడం ఇది రెండోసారి. ఆలయం వద్దకు చేరుకున్న అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత నెల సెప్టెంబర్‌ 15వ తేదీన ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి. బయటబడ్డ ఈ నాణేలు వెనుక పెద్ద చరిత్ర దాగి ఉన్నట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement