శుక్రవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి
By: chandrasekar Sat, 19 Sept 2020 1:27 PM
శుక్రవారం బంగారం ధరలు
మళ్లీ పెరిగాయి. ఈరోజు ప్రారంభ సెషన్లో తిరిగి బలపడ్డాయి. మల్టీ కమోడిటీ
ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ 0.2 శాతం
పెరిగి రూ.51,571 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.4 శాతం
పెరిగి రూ.68,405 పలికింది. అంతకుముందు సెషన్లో బంగారం తగ్గింది.
వెండి 0.7 శాతం
క్షీణించింది. గత మూడు వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ
ఉన్నాయి.
ఆగస్టు 7వ
తేదీన బంగారం ధరలు రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఆ ధరతో ఇప్పటికీ రూ.రూ.4,600 కంటే
పైన తక్కువగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.53,600 దిగువన పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.49వేల పైన పలికింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,650, 22 క్యారెట్ల బంగారం రూ.50,100 పలికింది. వెండి ధర రూ.67,800 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లోను
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ బంగారం 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,951.13 పలికింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్షీణించింది. దీంతో
బంగారం ధరపై ప్రభావం పడింది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం మేర పడిపోయింది. ఇతర అతి ఖరీదైన లోహాల
విషయానికి వస్తే వెండి 0.5 శాతం పడిపోయి ఔన్స్ 26.97 డాలర్లు, ప్లాటినమ్
0.4 శాతం
పడిపోయి 936
డాలర్లు పలికింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్
ఎస్పీడీఆర్ ఈటీఎప్ వద్ద గోల్డ్ నిల్వల్లో మార్పు లేదు. 1247.69 టన్నులుగా ఉన్నది.