పాక్ క్రికెటర్లకు దేవుడు బుద్ది ప్రసాదించాలని కోరుతున్న భారత ఆటగాడు ..
By: Sankar Tue, 28 July 2020 9:30 PM
పాక్ క్రికెటర్లపై భారత బ్యాట్స్మన్ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులపై, ఆటగాళ్లపై పాక్ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు ద్వేష పూరితంగా ఉన్నాయని అన్నాడు. అలాంటి పోస్టులు పెట్టేవారికి దేవుడు కాస్త బుద్ధి ప్రసాదించాలని అన్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. అందులో పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, వకార్ యోనిస్, సల్మాన్ బట్ వంటి క్రికెటర్లు చేసిన కొన్ని కామెంట్లను షేర్ చేశాడు.
అంతేకాకుండా ఒక్కసారి పాక్ క్రికెటర్ల కామెంట్లను చూస్తే వారెంత ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారో అర్థమవుతుందంటు కామెంట్ చేశాడు. వారందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఇన్స్టాగ్రాం పోస్టు చేశాడు.
కాగా ఇండియన్ క్రికెటర్ విషయంలో పాక్ క్రికెటర్లు చాల సార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆఫ్రిది , గంభీర్ మధ్య ఎన్నాళ్లనుంచో గొడవ జరుగుతున్నధీ అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఆఫ్రిది సచిన్ మీద కూడా విమర్శలు చేసాడు ..సచిన్ అక్తర్ బౌలింగ్ కు బయపడేవాడని ఆ విషయాన్ని సచిన్ ఒప్పుకోడు అని విమర్శించాడు