వైభవంగా సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు వివాహం
By: chandrasekar Mon, 02 Nov 2020 09:58 AM
హైదరాబాద్ లో వైభవంగా
సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు వివాహం జరిగింది. సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా భవాని శంకర శర్మ
వివాహం వెంకటలక్ష్మి హిమబిందు తో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్ల హోటల్లో 10.55
నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం
గంగరాజు, వంశీ
పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,వెంకట్
అక్కినేని, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన
వధూవురులని ఆశీర్వదించారు.
ఈ నూతన వరుడు రాజా
వెండితెరపై అలరించారు. ఆయన చివరిసారిగా భానుమతి రామకృష్ణ మూవీలో నటించారు.
అంతకముందు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ
వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఆగస్ట్లో వీరి నిశ్చాతార్ధం జరగగా, ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్
చేస్తూ 2020లో
గొప్ప ప్రయాణం నా కొత్త ప్రయాణానికి సంతోషిస్తున్నా అని పేర్కొన్నాడు.