గ్లెన్మార్క్ ఫార్మా తీపికబురు
By: chandrasekar Tue, 14 July 2020 12:35 PM
కరోనా వైరస్ చికిత్స కోసం
ఉపయోగించే ట్యాబ్లెట్స్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫవిపిరవిర్ ట్యాబెట్
ధరను రూ.103 నుంచి
రూ.75కు
తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంటే ధరలో 27 శాతం కోత విధించింది.
కాగా గ్లెన్మార్క్
ఫార్మా ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను ఫ్యాబిఫ్యూ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి
తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ
లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని కంపెనీ వెల్లడించింది.
కరోనా బారిన పడ్డవారు 1800 ఎంజీ
పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలని ఆ తర్వాత వరుసగా 14 రోజుల
పాటు 800 ఎంజీ
పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున వాడాలని సూచించింది. ఇకపోతే
గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ జూన్ 20న ఫ్యాబిఫ్యూ డ్రగ్ తయారీ, విక్రయానికి
సంబంధించి ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ నుంచి తమకు అనుమతులు లభించాయని ప్రకటించింది.
భారత్లో కేంద్రం నుంచి ఈ
కంపెనీకే తొలిగా అనుమతులు లభించాయి. కాగా కరోనా వైరస్ ఇంకా శరవేగంగానే విస్తరిస్తూ
వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు ఇప్పటికే 8.7
లక్షలకు పైగా చేరాయి. ఈ వైరస్ కారణంగా దేశంలో 23 వేల మందికి పైగా మరణించారు.