Advertisement

  • చదువుకుంటానని ఎంతో చెప్పి చూసింది...ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...!

చదువుకుంటానని ఎంతో చెప్పి చూసింది...ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...!

By: Anji Wed, 02 Dec 2020 8:26 PM

చదువుకుంటానని ఎంతో చెప్పి చూసింది...ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...!

తనకు ఇంకా చదువుకోవాలని ఉందని.. చదువుకుంటానని ఎంతో చెప్పి చూసింది. కానీ తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని భావించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సట్టా వినీత(20)కి వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.

తాను ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వినీత తీవ్రమనస్థాపానికి గురైంది.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు.

వినీత తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Tags :

Advertisement