ప్రేమించిన వాడి చేతిలో దారుణ హత్యకు గురి అయిన యువతి
By: Sankar Mon, 19 Oct 2020 11:04 AM
ప్రాణంగా ప్రేమించింది ..ప్రేమించిన వాడు దూరం పెడుతుంటే తట్టుకోలేక పోయి వెళ్లి అడుగుదామని ప్రియుడు ఇంటికి వెళ్ళింది ..కానీ ప్రేమించినవాడే తనపాలిట యముడు అవుతాడని ఊహించలేకపోయింది..పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురి అయిన దారుణ ఘటన హైద్రాబాద్లోని పాతబస్తీలో చోటు చేసుకుంది..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన రాధిక (24) కుటుంబం హైదరాబా ద్ ఆసిఫ్నగర్ దత్తాత్రేయనగర్లో ఉంటున్నది. రాధిక ప్రస్తుతం మహ్మాత్మాగాంధీ వర్సిటీలో ఎల్ఎల్బీ అభ్యసిస్తూ, హైటెక్సిటీలోని ఓ సంస్థ నిర్వహిస్తున్న పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థలో సభ్యురాలుగా ఉన్నది. మూగజీవాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది.
పాతనగరంలోని రెయిన్బజార్కు చెందిన సయ్యద్ ముస్తఫా కూడా సంస్థ నిర్వహించే కార్యక్రమాలను నిత్యం ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ మధ్య రాధికతో ముస్తఫా అంటీముట్టనట్టు వ్యవహరించాడు.
దీంతో ఆరా తీద్దామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. పెండ్లి సంగతేంటని నిలదీసింది. అక్కడే ఉన్న ముస్తఫా సోదరుడు జమీల్ కల్పించుకొని పెండ్లి జరగదంటూ రాధికపై దాడికి దిగాడు. ముస్తఫా కూడా దాడిచేశాడు. ఏదో ఒకటి తేలేవరకు కదిలేదని రాధిక అనటంతో కత్తులతో ఆమె మెడ కోసి హతమార్చారు.