Advertisement

  • బాలిక దారుణ హత్య... చెరుకు తోటలో శవమై కనిపించింది..!

బాలిక దారుణ హత్య... చెరుకు తోటలో శవమై కనిపించింది..!

By: Anji Mon, 12 Oct 2020 6:56 PM

బాలిక దారుణ హత్య... చెరుకు తోటలో శవమై కనిపించింది..!

దేశంలో ఎన్ని నిర్భయ, దిశ కేసులు వచ్చినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్దులు అని కూడా చూడకుండా అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవల హాథ్రస్ ఘటన మరవక ముందే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పసాగవాన్ గ్రామంలో కూడా ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. కనిపించకుండా పోయిన ఆమె చెరుకు తోటలో శవమై కనిపించింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలను సేకరించారు.

బాలిక తప్పిపోయిందని వెతుకుతున్న తల్లిదండ్రులకు విషాదం మిగిలింది. మెడ వద్ద గాయం గుర్తులు ఉండటంతో ఎవరో హత్య చేశారనే నిర్ధారణకు వచ్చారు. అయితే తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని ఇంతటి దారుణం ఎందుకు చేశారో తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విజయ్ ధుల్ తెలిపారు.

Tags :
|

Advertisement