Advertisement

రూ.5,999కే జియోనీ బడ్జెట్ ఫోన్...!

By: chandrasekar Wed, 26 Aug 2020 12:17 PM

రూ.5,999కే జియోనీ బడ్జెట్ ఫోన్...!


జియోనీ కంపెనీ మాక్స్‌ అనే బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ అమ్మకాల కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో రూ.5,999కే జియోనీ ఈ మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 31 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మబడును.

జియోనీ ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ లైఫ్ వాచీలు, పవర్ బ్యాంకులు, నెక్‌బ్యాండ్‌లు, హెడ్‌ఫోన్‌లు, వైర్‌లెస్ బ్లూ టూత్‌ వంటి పలు విజయవంతమైన గాడ్జెట్‌లను లాంచ్‌ చేసింది.

ఆండ్రాయిడ్ ఆధారిత జియోనీ మాక్స్ ఫోన్‌ 6.1-అంగుళాల హెచ్‌డి ప్లస్‌ ఫుల్ వ్యూ డ్యూ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

256 జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ ఆప్షన్‌ కూడా ఉంది. వెనుకవైపు 13 ఎంపీ బోకె లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ మోడ్‌ కెమెరా ఉంది.

ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 1.6జీహెచ్‌జడ్‌ క్లాక్ స్పీడ్, 2 జీబీ ర్యాం, 32 జీబీ ఇన్‌బుల్డ్‌ స్టోరేజీతో పనిచేస్తుంది.

జియోనీ మాక్స్ ‌.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంది. ఇంత బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఇతర స్మార్ట్‌ఫోన్లు రూ.8000 ధరను కలిగి ఉండగా జియోనీ మాత్రం 5,999కే అందిస్తోంది.

ఆసక్తికర హ్యాండ్‌సెట్ ఫీచర్‌తో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. హ్యాండ్‌సెట్ డ్యూయల్ సిమ్ కార్డులకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎరుపు, నలుపు, నీలం మూడు రంగుల్లో లభించనుంది.

Tags :
|
|
|

Advertisement