తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మృతి
By: chandrasekar Wed, 02 Dec 2020 3:43 PM
తెలంగాణ రాష్ట్రంలోని
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు
ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై
ఇన్నోవా కారు - బోర్వెల్ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల
చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా హైదరాబాద్ తాడ్బండ్
వాసులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని
సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నారు.
సికింద్రాబాద్ తాడ్బండ్ నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న
ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్వెల్ వాహనం చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్
శివారులో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. మృతులు
సికింద్రాబాద్లోని తాడ్బండ్కు చెందిన అసిఫ్ఖాన్, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా
గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.