తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ వ్యాన్...
By: chandrasekar Mon, 09 Nov 2020 6:51 PM
తమిళనాడులోని
మనియాట్చిపాలెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఓ వ్యాన్
ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించగా
మరో 11 మంది
కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగగానే వాహనం కొండ మీద నుంచి పల్టీలు కొడుతూ
కిందున్న రోడ్డు మీద అడ్డంగా పడింది. ఆ వ్యాన్లో ఉన్న కూలీలందరూ చెల్లా చెదురుగా
పడిపోయారు. దట్టమైన చెట్లు, పొదళ్లతో నిండిన ఈ మార్గంలో ఎవరు ఎక్కడ పడ్డారో అనే
విషయాన్ని గుర్తించడం కూడా కష్ట౦గా మారింది. అటుగా వచ్చిన వాహనదారులు ప్రమాదం
విషయాన్ని గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. దీంతో 108
సిబ్బంది వచ్చి గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు.
మనియాట్చిపాలెంలోని అందియూరు కొండల్లో ఆదివారం (నవంబర్ 8) ఉదయం ఈ
ప్రమాదం చోటు చేసుకుంది.
వాహనంలో సాంకేతిక సమస్య
తలెత్తడంతో డ్రైవర్ వ్యాన్పై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు. ఓవర్
లోడింగ్, అతివేగం
కూడా ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈరోడ్ జిల్లా అందయూరు సమీపంలోని బర్గూర్
కొండ మార్గంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన అనేక తోటలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది
కూలీలు పనిచేస్తుంటారు. ఆ కూలీలను రోజూ వాహనాల్లో తరలిస్తుంటారు. ఆదివారం ఉదయం
ఇదేవిధంగా తంబురెడ్డి పట్టి గ్రామం నుంచి 15 మంది కూలీలను వ్యాన్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం
జరిగింది. ఇరుకైన మార్గం కావడంతో సహాయ చర్యల్లో ఆలస్యం జరిగింది. అంబులెన్స్లు
రావడానికే సమయం పట్టింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు
అధికారులు పేర్కొన్నారు.