Advertisement

సిమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

By: chandrasekar Fri, 25 Sept 2020 4:13 PM

సిమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...


ఉత్తరాఖండ్‌లోని సిమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి పల్టీకొట్టడంతో యువకుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

రోహ్రూకు సమీపంలోని జాఖర్‌ లింక్‌ రోడ్డు వద్ద గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నితీశ్‌కుమార్‌ అనే యువకుడు మృతి చెందాడు. అమన్‌, అభయ్‌, రాఘవ్‌ రావత్‌, రితిక్‌, రాజన్‌ అనే ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారు నడుపుతున్న అభయ్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రోహ్రూ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసారు.

Tags :
|
|
|

Advertisement