Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలు ఆ పద్దతిలోనే...రాష్ట్ర ఎన్నికల సంఘం

జిహెచ్ఎంసి ఎన్నికలు ఆ పద్దతిలోనే...రాష్ట్ర ఎన్నికల సంఘం

By: Sankar Mon, 05 Oct 2020 4:38 PM

జిహెచ్ఎంసి ఎన్నికలు ఆ పద్దతిలోనే...రాష్ట్ర ఎన్నికల సంఘం


బ్యాలెట్ పద్ధతిలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా ? లేక ఈవీఎం ద్వారా నిర్వహించాలా ? అని అభిప్రాయం కోరగా గ్రేటర్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని మెజారిటీ రాజకీయ పార్టీలు కోరాయి.

తెలంగాణ లో గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు 50 ఉండగా అందులో 26 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయి. 3 పార్టీలు మాత్రమే ఈవిఎం ల ద్వారా నిర్వహించాలని కోరగా.. 13 పార్టీలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరాయి. మెజారిటీ పొలిటికల్ పార్టీల అభిప్రాయం మేరకు ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకి వెళ్లనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పిటిసి 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా అన్ని బ్యాలెట్ పద్ధతి లోనే జరిగాయి. రాబోయే జిహెచ్ఎంసి తో పాటు మిగిలిన కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Tags :
|

Advertisement