Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలు ..మొదలయిన కౌంటింగ్ ..పోస్టల్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం

జిహెచ్ఎంసి ఎన్నికలు ..మొదలయిన కౌంటింగ్ ..పోస్టల్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం

By: Sankar Fri, 04 Dec 2020 10:18 AM

జిహెచ్ఎంసి ఎన్నికలు ..మొదలయిన కౌంటింగ్ ..పోస్టల్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం

రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎప్పుడెప్పుడా అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మొదలయింది..మొదటి లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధిస్తోంది.

ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతోంది.

గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. మరోవైపు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 82 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 29 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

Tags :
|

Advertisement