Advertisement

  • పెట్రోల్ కొట్టించుకుంటే బిర్యానీ ఫ్రీ ..ఎక్కడో తెలుసా !

పెట్రోల్ కొట్టించుకుంటే బిర్యానీ ఫ్రీ ..ఎక్కడో తెలుసా !

By: Sankar Tue, 22 Sept 2020 08:11 AM

పెట్రోల్ కొట్టించుకుంటే బిర్యానీ ఫ్రీ ..ఎక్కడో తెలుసా !

వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక కంపెనీలు విన్నూత్న ఆఫర్లను ప్రకటిస్తాయి..ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అని , రెండు కొంటె డిస్కౌంట్ అని ఇలా అనేక రకాల ఆఫర్లతో వినియోగదారుడిని మెప్పించే ప్రయత్నం చేస్తాయి..సరిగ్గా అలాగే బెంగళూరులో శ్రీవెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ యజమాని విన్నూత్న ఆఫర్ ప్రకటించాడు..

తమ స్టేషన్ లో పెట్రోల్ కొట్టించుకున్న వారికి బిర్యానీని ఫ్రీగా అందించేందుకు సిద్ధం అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది. ఈరోజు నుంచి నెల రోజులపాటు ఈ అఫర్ అందుబాటులో ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది. గత యాభై ఏళ్లుగా పెట్రోల్ వ్యాపారంలో ఉన్నామని, కర్ణాటకలో అత్యధిక ఇంధనం అమ్మిన ఘనత తమకే దక్కిందని యాజమాన్యం పేర్కొన్నది. వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ అఫర్ ప్రకటించింది.

అయితే, రెండు వేలరూపాయల పెట్రోల్ ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే బిర్యానీ అఫర్ వర్తిస్తుంది. ఇక రూ.250 కి పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్టు యాజమాన్యం పేర్కొన్నది.

Tags :
|

Advertisement