కోహ్లీ ఒక బ్యాట్స్మెన్ గానే కాదు కెప్టెన్గా కూడా టైటిల్ గెలవాలన్న గౌతమ్ గంభీర్
By: chandrasekar Wed, 16 Sept 2020 10:21 AM
కోహ్లీ ఒక బ్యాట్స్మెన్
గానే రాణించడం పట్ల ఇప్పుడు కెప్టెన్గా కూడా టైటిల్ గెలవాలని గౌతమ్ గంభీర్
సూచించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 2016లో
ఫైనల్కి చేరిన బెంగళూరు టీమ్ టైటిల్ చేజిక్కించుకునేలా కనిపించింది. కానీ ఆఖర్లో
కోహ్లీ ఔటవగా ఒత్తిడికి గురైన ఆర్సీబీ టీమ్ టైటిల్ని సన్రైజర్స్ హైదరాబాద్కి
సమర్పించుకుంది. ఆ తర్వాత 2017, 2018, 2019 సీజన్లలో కనీసం ప్లేఆఫ్కి కూడా బెంగళూరు టీమ్ అర్హత
సాధించలేకపోయింది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం 308, 530, 464 పరుగులు చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి
నవంబరు 10 వరకూ
ఐపీఎల్ 2020 సీజన్
జరగనుండగా సెప్టెంబరు 21న సన్రైజర్స్
హైదరాబాద్తో దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఫస్ట్ మ్యాచ్లో
తలపడనుంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ టీం బాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ మరియు అల్
రౌండర్లతో బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈసారి ఐపీఎల్ 2020 సీజన్లోనైనా
విజేతగా నిలవాలని బెంగళూరు టీమ్ ఆశిస్తుండగా
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పట్టుదలతో కనిపిస్తున్నాడు. అయితే కెప్టెన్ కోహ్లీ పరుగులు సాధించడం కంటే మ్యాచ్ల్లో
టీమ్ని గెలిపించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోల్కతా నైట్రైడర్స్ మాజీ
కెప్టెన్ గౌతమ్ గంభీర్ సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో గౌతమ్
గంభీర్ మాట్లాడుతూ గత సీజన్లలో పోలిస్తే బెంగళూరు టీమ్ ఇప్పుడు మంచి సమతూకంతో
కనిపిస్తోంది. గతంలో ఆర్సీబీ ఎక్కువగా బ్యాటింగ్నే నమ్ముకునేది. బౌలింగ్ గురించి
అస్సలు పట్లించుకునేది కాదు. కానీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆ టీమ్ మేనేజ్మెంట్ మంచి బౌలర్లు, ఆల్రౌండర్లని
తీసుకుంది. ఓపెనర్ అరోన్ ఫించ్ కూడా టీమ్తో చేరడం అదనపు బలం. విరాట్ కోహ్లీకి
ఐపీఎల్ 2020 పెద్ద
ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పటికే అతని సహచరులు
రోహిత్ శర్మ నాలుగు సార్లు, ధోనీ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచారు. మరి 8-9
ఏళ్లుగా కెప్టెన్గా ఉన్న కోహ్లీ సంగతేంటి? బ్యాట్స్మెన్గా ఈ సీజన్లోనూ కోహ్లీ పరుగులు
చేస్తాడు. కానీ అంతిమంగా టైటిల్ గెలవాలి. ఒక బ్యాట్స్మెన్ గానే కాదు కెప్టెన్గా
కూడా టైటిల్ కోహ్లీకి ఇప్పుడు అత్యవసరం అని గంభీర్ వెల్లడించాడు.