ఆర్సీబిలోనే కాదు ..ఆ జట్టులో కూడా డివిలియర్స్ ఉన్నాడు..
By: Sankar Sun, 13 Sept 2020 7:46 PM
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోనూ ఒక ఏబీ డివిలియర్స్ ఉన్నాడని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. పంజాబ్ జట్టు గురించి స్టార్స్పోర్ట్స్ షోలో గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ యువ హిట్టర్ నికోలస్ పూరన్పై ప్రశంసల వర్షం కురిపించిన గౌతమ్ గంభీర్.. అతడ్ని మరో ఏబీ డివిలియర్స్గా అభివర్ణించాడు..
ఐపీఎల్ 2020 సీజన్లో నికోలస్ పూరన్ బ్యాటింగ్ చూడాలని నేను ఆశిస్తున్నా. అతను ఇంకా యువ క్రికెటరే. సాధారణంగా మనం ఏబీ డివిలియర్స్ని 360° ప్లేయర్గా పిలుస్తుంటాం. అతనిలానే నికోలస్ పూరన్ కూడా మైదానం నలువైపులా అన్ని రకాల షాట్లని ఆడగలడు. ముఖ్యంగా.. రివర్స్ స్వీప్, నార్మల్ స్వీప్ చక్కగా ఆడతాడు. అంతేకాదు.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా భారీ సిక్సర్లని కూడా పూరన్ బాదగలడు’’ అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు..
గత ఏడాది ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఈ యువ హిట్టర్ 157 స్ట్రైక్రేట్తో 168 పరుగులు చేశాడు. అయితే.. ఇటీవల విండీస్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన ఈ హిట్టర్ని ఐపీఎల్ 2020 సీజన్లో విరివిగా పంజాబ్ టీమ్ అవకాశాలిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.