నేను మరికొంత కాలం ఐపీయల్ ఆడాల్సింది ..సౌరవ్ గంగూలీ
By: Sankar Mon, 06 July 2020 10:23 AM
ఇండియన్ క్రికెట్ లో ఒకప్పుడు సిక్సర్ల కేర్ అఫ్ అడ్రెస్ ఎవరు అంటే అందరికి గుర్తొచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ..స్పిన్నర్ల బౌలింగ్లో ముందుకు వచ్చి గంగూలీ సిక్సర్లు బాదుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు ..అయితే టి ట్వంటీ క్రికెట్ వచ్చిన తర్వాత అనేక మంది పవర్ హిట్టర్స్ వచ్చారు ..అయితే ఇప్పుడు ఉన్న తరంలో ఉంది ఉంటె తాను కూడా టి ట్వంటీ క్రికెట్ అద్భుతంగా ఆడేవాడిని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు ..
టి20 ఫార్మాట్కు తగినట్లుగా తన క్రికెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేవాడినని అన్నాడు. పవర్ హిట్టింగ్కు ఈ ఫార్మాట్ లైసెన్స్గా పనిచేస్తుందని పేర్కొన్నాడు. ‘టి20 క్రికెట్ ఆడి ఉంటే ఆ ఫార్మాట్ను నేను ఆస్వాదించేవాడిని. ఐపీఎల్లో ఐదేళ్లు ఆ ఫార్మాట్లో ఆడినప్పటికీ మరింతకాలం ఆడితే బావుండు అనిపిస్తోంది’ అని బీసీసీఐ ట్విట్టర్ ఖాతా వేదికగా గంగూలీ పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్ సంబరాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘అవి గొప్ప క్షణాలు. అలాంటి మ్యాచ్ గెలుపొందితే చేసుకునే సంబరాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నేను ఆడిన గొప్ప మ్యాచ్ల్లో నాట్వెస్ట్ ఫైనల్ కూడా ఒకటి’ అని గంగూలీ నాటి మధుర స్మృతులను తలుచుకున్నాడు.ఆ ఫైనల్లో టీం ఇండియా ఘన విజయం సాధించడంతో గంగూలీ చొక్కా విప్పి సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే ..