Advertisement

  • గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య, కొడుకును యూపీ పోలీసులు అరెస్ట్ చేసారు

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య, కొడుకును యూపీ పోలీసులు అరెస్ట్ చేసారు

By: chandrasekar Fri, 10 July 2020 3:16 PM

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య, కొడుకును యూపీ పోలీసులు అరెస్ట్ చేసారు


లక్నోలోని కృష్ణానగర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య, కొడుకును కూడా యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దూబే భార్యను, కుమారుడిని, ఇద్దరు ప‌నివాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూబే భార్య రిచా దూబే సమాజ్‌వాదీ పార్టీలో చురుగ్గా ప‌నిచేస్తున్నారు. అంతేకాదు ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.

జూలై 2న పోలీసులను కాల్చిచంపిన‌ ఘటనలో దూబే భార్య, కుమారుడి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. దూబేకు ట్రాన్సిట్ రిమాండ్‌ విధించగానే ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తున్నారు.

గురువారం ఉద‌యం మధ్యప్రదేశ్ ఉజ్జెయినీ మహంకాళి మందిర్‌లో దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో వికాస్ దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీసీపీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు.

Tags :
|

Advertisement