Advertisement

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికాస్ దూబే ఖేల్ కథం .. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికాస్ దూబే ఖేల్ కథం .. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

By: Sankar Fri, 10 July 2020 10:01 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికాస్ దూబే ఖేల్ కథం ..  ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను.. ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. ఎస్టీఎఫ్ దళాలు వికాస్‌ను యూపీలోని కాన్పూర్‌కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో అతడిని తీసుకెళ్తోన్న కాన్వాయ్ బోల్తా పడింది. దీంతో, పోలీసుల కస్టడీ నుంచి వికాస్ దూబే తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు కాల్చి చంపినట్టు పేర్కొన్నాయి.

వికాస్ దూబేను తీసుకెళ్తోన్న వాహనం.. కాన్పూర్ సమీపంలోని బారా వద్ద ఉదయం 7.00 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. దీన్ని అవకాశం తీసుకుని పారిపోయేందుకు దూబే ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారని తెలుస్తోంది. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా కాన్వాయ్‌లో వాహనం బోల్తాపడిందని,దీన్ని ఆసరాగా తీసుకుని పారిపోయేందుకు వికాస్ ప్రయత్నించాడు.. కానిస్టేబుల్ వద్ద తుపాకి లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. తాము ఆత్మ రక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపామని యూపీ పోలీసులు తెలిపారు.

అయితే దాదాపు 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి గురువారం రాత్రి పోలీసులు అక్కడకు చేరుకోగా ..తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు ఎనిమిది మందిని అతి దారుణంగా వికాస్ దూబే చంపిన విషయం తెలిసిందే ..ఇతడితో పాటు ఇతడి అనుచరులను కూడా పట్టుకున్న పోలీసులు వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేసారు ..

Tags :
|

Advertisement