Advertisement

  • రైతుల నిరసనకు మద్దతుగా బిక్షాటన చేసిన గద్వాల ఎంఎల్ఏ

రైతుల నిరసనకు మద్దతుగా బిక్షాటన చేసిన గద్వాల ఎంఎల్ఏ

By: Sankar Mon, 14 Dec 2020 1:22 PM

రైతుల నిరసనకు మద్దతుగా బిక్షాటన చేసిన గద్వాల ఎంఎల్ఏ


కేంద్రం తెచ్చిన కొత్త సాగు చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. రైతుల న‌డ్డి విరిచేందుకు కేంద్రం య‌త్నించ‌డం దారుణ‌మ‌న్నారు.

రాష్ర్టంలోని రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప‌థంలో ముందుకెళ్తున్న తెలంగాణ రైతాంగానికి కేంద్రం తెచ్చిన కొత్త సాగు బిల్లులు తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌ని గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు..

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైత‌న్న‌ల‌కు గ‌ద్వాల ఎమ్మెల్యే ఓ భ‌రోసానిచ్చారు. అన్న‌దాత‌ల క‌డుపు నింపేందుకు ఎమ్మెల్యే భిక్షాట‌న చేప‌ట్టారు. జిల్లాలోని మల్ద‌క‌ల్ మండ‌లంలో ఎమ్మెల్యే జోలే ప‌ట్టుకుని ఇంటింటికి వెళ్లి పిడికెడు చొప్పున బియ్యాన్ని సేక‌రించారు. సేక‌రించిన‌ ఈ బియ్యాన్ని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌కు పంపిస్తాన‌ని తెలిపారు కేంద్రం కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని ఎమ్మెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు

Tags :
|
|

Advertisement