Advertisement

  • చలో ప్రగతి భవన్ అడ్డుకునేందుకు ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు...

చలో ప్రగతి భవన్ అడ్డుకునేందుకు ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు...

By: Sankar Tue, 27 Oct 2020 12:20 PM

చలో ప్రగతి భవన్ అడ్డుకునేందుకు ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు...


హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడి కి నిరసనగా నేడు చలో ప్రగతి భవన్ కు ఎబివిపి, బిజేవైఎం పిలుపు నిచ్చిన నేపధ్యంలో వందల సంఖ్యలో ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించారు పోలీసులు. అలానే తెలంగాణా భవన్ వద్ద కూడా పోలీసులు మొహరించారు. ఇక మరో పక్క బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష కొనసాగుతోంది.

సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలంటూ సంజయ్ దీక్షకు దిగారు. నిన్న రాత్రి 9.30 గంటలకు పోలీసుల తీరుకు నిరసనగా దీక్షకు సంజయ్ దిగారు. సిద్దిపేట ఘటనపై నిన్న అమిత్ షా ఆరా తీశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలకు రెడీ అవుతున్నాయి పార్టీ శ్రేణులు. సంజయ్ దీక్షకు సంఘీభావం తెలపడానికి డి కె అరుణ, ఎంపీ సాయం బాబు రావులు వెళ్లనున్నారు. సంజయ్ దీక్ష పై ఆరా తీస్తున్న పోలీసులు దీక్ష కేంద్రం వద్ద నిఘా ఏర్పాటు చేశారు.

కాగా దుబ్బాకలో పోలీసుల తనిఖీలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే . బీజేపీ కార్యకర్తల డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అడ్డగింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్‌ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదాచేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పగా.. పోలీసులే డబ్బులు తెచ్చిపెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

Tags :

Advertisement