Advertisement

ఐపీఎల్ 2020 సీజన్‌పై పూర్తి స్థాయిలో క్లారిటీ

By: chandrasekar Sat, 25 July 2020 08:47 AM

ఐపీఎల్ 2020 సీజన్‌పై పూర్తి స్థాయిలో క్లారిటీ


యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ శుక్రవారం స్పష్టం చేశాడు. మొత్తం 51 రోజుల ఈ విండోలో 60 మ్యాచ్‌లు జరగనుండగా కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌పై ఇలా బ్రిజేశ్ పటేల్ క్లారిటీ ఇవ్వగానే ట్విట్టర్‌లో అలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ట్రోల్స్ మొదలైపోయాయి.

ఐపీఎల్‌లో కారణం ఏదైనా ఆర్సీబీపై ట్రోల్స్ చాలా కామన్. ఆ జట్టు గెలిచినా ఓడినా ఫ్యాన్స్ మాత్రం సెటైర్లు వేస్తుంటారు. దానికి కారణం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోవడమే. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా రెండు సార్లు ఫైనల్‌కి చేరిన ఆ జట్టు ఒక్కసారి కూడా కప్‌ని గెలవ లేకపోయింది. కానీ.. ప్రతి ఏడాది ఈసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం ఆఖరికి ఉసూరమనిపించడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది.

ముంబయి ఇండియన్స్ నాలుగు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం టోర్నీ విజేతగా నిలవలేకపోతోంది. బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలకడగా రాణించినప్పటికీ కెప్టెన్‌గా టీమ్‌ని సమష్టిగా నడిపించడంలో అతను విఫలమవుతున్నాడు. దాంతో కనీసం ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా ఆర్సీబీ కప్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement