Advertisement

  • నేటి నుంచే ఏపీలో ఆ తరగతులకు పాఠశాలలు ప్రారంభం

నేటి నుంచే ఏపీలో ఆ తరగతులకు పాఠశాలలు ప్రారంభం

By: Sankar Mon, 23 Nov 2020 06:27 AM

నేటి నుంచే ఏపీలో ఆ తరగతులకు పాఠశాలలు ప్రారంభం


బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది.

ఏ ఒక్కరూ కరోనా వైరస్‌ బారిన పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా తల్లిదండ్రుల సమ్మతి లేఖతో విద్యార్థులు గురుకులాలకు రావలసి ఉంటుంది. నాలుగు మాస్కులు వెంట తెచ్చుకోవాలి. గురుకులాల వద్ద విద్యార్థులను థర్మల్‌ స్కానర్‌లతో సంస్థ వైద్య బృందం పరీక్షిస్తుంది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ విద్యార్థిని వెంటనే తిరిగి ఇంటికి పంపిస్తారు.

కాగా క్లాసులు ఉదయం 8:15 నుండి సాయంత్రం 1:30 వరకు జరుగుతాయి. క్యాంపస్, హాస్టల్, డైనింగ్‌ హాల్, మరుగుదొడ్లు ఇలా ప్రతిచోటా విద్యార్థులు సురక్షిత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ వివరాలు వెల్లడించారు.

Tags :
|
|
|

Advertisement