వచ్చే ఏడాది ప్రతి ఇంటికీ ఉచిత తాగునీరు...
By: chandrasekar Sat, 19 Dec 2020 6:09 PM
నగరంలోని ప్రతి ఇంటికీ
నూతన సంవత్సరంలో ఉచిత తాగునీరు పంపిణీపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని ప్రతి ఇంటికీ నూతన సంవత్సరంలో
ఉచిత తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల
మేరకు జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితంగా ఇస్తామని స్పష్టం
చేశారు.
జనవరి నెలలో వినియోగదారులకు
వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ వేయ వద్దని కేటీఆర్
అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సర తొలివారంలో హైదరాబాద్లో ఉచిత తాగునీటి
కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సోమేశ్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులు హాజరయ్యారు.