Advertisement

  • శ్రీవారి భక్తులకు ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు

శ్రీవారి భక్తులకు ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు

By: chandrasekar Mon, 26 Oct 2020 1:24 PM

శ్రీవారి భక్తులకు ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు


శ్రీవారి భక్తులకు ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను నేటి నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లలో జారీ చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి భక్తులకు రోజుకు 3 వేల చొప్పున దర్శన టోకెన్లను అందిస్తారు. కౌంటర్లకు ముందు వచ్చిన వారికి ముందుగా టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు టోకెన్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.

స్వామి వారిని దర్శించుకొనుటకు ఈ ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులను మాత్ర‌మే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమ‌లకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. ఈ ఉచిత దర్శనాల టోకెన్ల విధానాన్ని పరిశీలించి త్వరలో దర్శనాల సంఖ్య పెంచుతామంటోంది టీటీడీ. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. అలాగే బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ తర్వాత రోజు ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా నిర్వహించబడింది.

Tags :
|

Advertisement