Advertisement

  • గంగూలీ లేఖతో ఐపీయల్ నిర్వహణపై ధీమా వచ్చింది ..ఇర్ఫాన్ పఠాన్

గంగూలీ లేఖతో ఐపీయల్ నిర్వహణపై ధీమా వచ్చింది ..ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Wed, 17 June 2020 7:41 PM

గంగూలీ లేఖతో ఐపీయల్ నిర్వహణపై ధీమా వచ్చింది ..ఇర్ఫాన్ పఠాన్



ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ సంఘాలకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల లేఖ రాయడంతో.. టోర్నీపై అందరికీ ధీమా పెరిగిందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. గడువులోపు పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలు కనిపించడంతో ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. కానీ.. టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏటూ తేల్చకపోవడంతో ఐపీఎల్‌పై సందిగ్ధత నెలకొంది.

గంగూలీ లేఖతో ఐపీఎల్‌ 2020 సీజన్‌పై అందరికీ ఓ ధీమా వచ్చిందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. ‘‘సౌరవ్ గంగూలీ విడుదల చేసిన స్టేట్‌మెంట్ చదివాను. ఐపీఎల్ నిర్వహణకి బీసీసీఐ శాయశక్తులా ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడాలని ఆశిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగడం అనుమానమే. ఎందుకంటే.. అక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి. వరల్డ్‌కప్‌ కోసం 16 జట్లు అక్కడికి చేరుకోవడం.. ఆ తర్వాత క్వారంటైన్ అసాధ్యం. కాబట్టి.. టీ20 వరల్డ్‌కప్ నిర్వహించడం చాలా కష్టం. ఐపీఎల్ నిర్వహిస్తామని గంగూలీ చెప్తుండటంతో.. భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లలో కూడా ధీమా పెరిగింది.’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.



Tags :
|
|

Advertisement