గాంధీ ఆసుపత్రి కరోనా వార్డ్ నుంచి పరారయిన ఖైదీలు
By: Sankar Thu, 27 Aug 2020 12:46 PM
గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డు నుంచి కోవిడ్తో చికిత్స పొందుతున్న నలుగురు జైలు ఖైదీలు ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దాంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వారు అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు పరారీ అయ్యారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి పారిపోయారు. వీరిలో ఇద్దరు చంచల్గూడ రిమాండ్లో ఉన్న ఖైదీలు ఉన్నారు. మరొకరు చర్లపల్లి జైలులో శిక్ష ఖరారైన ఖైదీ కాగా ఇంకొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరారైన ఖైదీ..
పరారిలో ఉన్న వారిలో అబ్దుల్ రబాజా రాజేంద్రనగర్ లో కేసులో నిందితుడు, ఎండి జావీద్ శ్యామ్ తాండూరు కేసులో నిందితుడు. సుందర్,నర్సింహా శిక్ష కరారైన ఖైదీలు. ఇక ఈ నలుగురు ఖైదీలు ఆస్పత్రి నుంచి పరారయిన వారిపై చిలకగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లోనే ఇతర వార్డుల్లో నక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాంధీ హాస్పిటల్లో గాలింపు చర్యలు చేపట్టారు..