గచ్చిబౌలిలో ఘోరరోడ్డుప్రమాదం ..అక్కడిక్కడే నలుగురు మృతి
By: Sankar Sun, 13 Dec 2020 07:41 AM
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు.
మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చెసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, కారు సిగ్నల్ జంప్ చేయడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు
Tags :
killed |