సిద్ధిపేట శివారులో వరుస రోడ్డు ప్రమాదాలు ..నలుగురు మృతి , పన్నెండు మందికి గాయాలు
By: Sankar Fri, 04 Dec 2020 6:41 PM
సిద్దిపేట శివారులో శుక్రవారం సాయంత్రం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడి ముగ్గురు దుర్మరణం చెందారు.
ఘటనాస్థలంలో పోలీసులు సహాయ చర్యలు చేపడుతుండగా అక్కడివారిపైకి డీసీఎం వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో మరొకరు మృతి చెందారు. సీఐ, కానిస్టేబుల్తో సహా 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో సిద్దిపేట టూటౌన్ సీఐ పరశురాంగౌడ్ గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి మల్లేశం, మందపల్లి కి చెందిన రాజిరెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదం నుండి SI కనకయ్య గౌడ్ క్షేమంగా బయట పడ్డారు. ఘటన స్థలానికి CP జోయల్ డేవిస్ సిద్దిపేట్, ఎసిపి రామేశ్వర్ వచ్చి క్షేతగాత్రులని చికిత్స గురించి హాస్పిటల్స్ కు తరలించారు.