Advertisement

  • ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి బోల్తా పడి నలుగురి మరణం...

ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి బోల్తా పడి నలుగురి మరణం...

By: chandrasekar Tue, 22 Dec 2020 2:12 PM

ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి బోల్తా పడి నలుగురి మరణం...


సిక్కింలోని నాథులా వ‌ద్ద డిసెంబర్ 20 రాత్రి ఘోర రోడ్డు ప్రమాద౦ జ‌రిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సిక్కింలోని నాథులా వ‌ద్ద డిసెంబర్ 20 రాత్రి ఈ ఘోరం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ కల్నల్ కుమారునితో పాటు ముగ్గురు సైనికులు మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో జవాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహ‌నం జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ రోడ్డులో 17వ మైలు వ‌ద్ద అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. జవాన్ల వాహనం రోడ్డు మీద నుంచి పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. దట్టమైన పొగ మంచు కారణంగా దారి సరిగా తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు.

Tags :
|
|
|
|

Advertisement