Advertisement

  • తెలంగాణాలో ఒకే రోజు నలుగురు ఐపీఎస్ ల పదవి విరమణ

తెలంగాణాలో ఒకే రోజు నలుగురు ఐపీఎస్ ల పదవి విరమణ

By: Sankar Tue, 30 June 2020 9:09 PM

తెలంగాణాలో ఒకే రోజు నలుగురు ఐపీఎస్ ల పదవి విరమణ



రాష్ట్రంలో నేడు నలుగురు ఐపీఎస్ అధికారులు పదవీవిరమణ చేశారు. పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎస్‌ఐబీ డీఐజీ ప్రభాకర్ రావు, పోలీస్ కమిషనర్, వరంగల్ డాక్టర్ రవీందర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ వేంకటేశ్వర రావు.

వీరిలో మొదటి ముగ్గురు డీఎస్పీలుగా చేరి ఐపీఎస్ లు కాగా, వేంకటేశ్వర్ రావు మాత్రం ఎస్ఐగా సర్వీసు ప్రారంభించి వివిధ పదోన్నతుల తర్వాత డీఐజీ హోదాకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు... ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ఎస్ఐ తన సర్వీసులో డీఐజీగా పదోన్నతి పొందిన దాఖలాలు లేవు. ఈ అరుదైన ఘట్టం వెంకటేశ్వర రావుకు సొంతమైంది.

సీనియర్‌ ఎస్పీ హోదాలో మాదాపూర్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకటేశ్వర రావుకు ఏప్రిల్‌లోనే ప్రభుత్వం డీఐజీగా ప్రమోషన్ ఇచ్చింది. దీంతో సైబరాబాద్ జాయింట్ సీపీ నియమించిన సర్కారు.. మాదాపూర్ డీసీపీగా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది. తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఓ ఎస్సై తన సర్వీసులో డీఐజీగా పదోన్నతి పొందిన దాఖలాలు లేవు. కానీ ఈ అరుదైన ఘనతను వెంకటేశ్వర రావు సొంతం చేసుకున్నారు.

Tags :
|
|

Advertisement