Advertisement

  • ఆదిలాబాద్‌లో పానీపురీ తిని నలభై మందికి అనారోగ్యం

ఆదిలాబాద్‌లో పానీపురీ తిని నలభై మందికి అనారోగ్యం

By: chandrasekar Wed, 27 May 2020 3:32 PM

ఆదిలాబాద్‌లో పానీపురీ తిని నలభై మందికి  అనారోగ్యం


పానీపురీ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సాయంత్రమైతే చాలు రోడ్డు పక్కన ఉన్న పానీపురీ బండి దగ్గర గప్‌చుప్‌లు లాగించేయడానికి పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఆ ఇష్టమే 40 మంది అస్వస్థతకు గురి కావడానికి కారణమైంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్య నగర్‌కు చెందిన చిన్నారులు సోమవారం సాయంత్రం ఓ తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు. రాత్రి 9 గంటల నుంచి వారికి వాంతులు, విరేచనాలు కావడం మొదలైంది. దీంతో ఒకరి తర్వాత మరొకరు మొత్తం 40 మంది రిమ్స్‌లో చేరారు.

forty,people,sick,eating,panipuri ,ఆదిలాబాద్‌లో, పానీపురీ, తిని, నలభై మందికి,  అనారోగ్యం


ఇంత మంది అస్వస్థతతో రిమ్స్‌లో చేరడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీయగా వారంతా పానీపురీ తిన్న విషయం వెలుగులోకి వచ్చింది. వారికి ప్రాణాపాయం లేదని కోలుకుంటున్నారని రిమ్స్ వైద్యులు ప్రకటించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం పానీపురీ అమ్మకాలకు వెసులుబాటు లేదు. కానీ కొంత మంది ఉపాధి కోసం కాలనీలకు వెళ్లి పానీపురీని విక్రయిస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement