Advertisement

  • మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆన్ లైన్ టోర్నమెంట్ లో పరాజయం

మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆన్ లైన్ టోర్నమెంట్ లో పరాజయం

By: chandrasekar Fri, 31 July 2020 09:59 AM

మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆన్ లైన్ టోర్నమెంట్ లో పరాజయం


భారత చెస్ ఛాంపియన్ ఆన్ లైన్ టోర్నమెంట్ ను భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పరాజయంతో ముగించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో ఎనిమిదింట ఓడి, పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానానికి (9) పరిమితమయ్యాడు.

ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్ లో విశ్వనాథన్ వాసిల్ ఇవాంచుక్ (ఉక్రెయిన్ ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆనంద్ – వాసిల్ హోరాహోరీగా తలపడడంతో తొలి నాలుగు గేమ్ లు డ్రాగా ముగిశాయి. ఆ తర్వాత టై బ్రేకర్ నిర్వహించినా అది కూడా సమమైంది.

బుధవారం జరిగిన పోటీలో డిసైడర్ లో తెల్ల పావులతో బరిలోకి దిగిన ఆనంద్ ఓటమి పాలయ్యాడు. పాయింట్ల పట్టికలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ (నార్వే , 25పాయింట్లు) టాప్ లో ఉన్నాడు. కార్ల్ సన్ తో పాటు పీటర్ స్విడ్లర్ (రష్యా) , అనిశ్ గిరి (హంగేరీ), ఇయాన్ నిపోమ్ నియాచి (రష్యా) సెమీ ఫైనల్ కు చేరారు.

Tags :
|

Advertisement