మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆన్ లైన్ టోర్నమెంట్ లో పరాజయం
By: chandrasekar Fri, 31 July 2020 09:59 AM
భారత చెస్ ఛాంపియన్ ఆన్ లైన్ టోర్నమెంట్ ను భారత గ్రాండ్ మాస్టర్, మాజీ
ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పరాజయంతో ముగించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో
ఎనిమిదింట ఓడి, పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానానికి (9) పరిమితమయ్యాడు.
ఈ టోర్నీలో చివరిదైన
తొమ్మిదో రౌండ్ లో విశ్వనాథన్ వాసిల్ ఇవాంచుక్
(ఉక్రెయిన్ ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆనంద్ – వాసిల్ హోరాహోరీగా తలపడడంతో తొలి నాలుగు గేమ్ లు డ్రాగా ముగిశాయి. ఆ తర్వాత టై బ్రేకర్
నిర్వహించినా అది కూడా సమమైంది.
బుధవారం జరిగిన పోటీలో డిసైడర్ లో తెల్ల పావులతో బరిలోకి దిగిన ఆనంద్ ఓటమి
పాలయ్యాడు. పాయింట్ల పట్టికలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్
కార్ల్ సన్ (నార్వే , 25పాయింట్లు)
టాప్ లో ఉన్నాడు. కార్ల్ సన్ తో
పాటు పీటర్ స్విడ్లర్ (రష్యా) , అనిశ్ గిరి (హంగేరీ), ఇయాన్ నిపోమ్ నియాచి (రష్యా)
సెమీ ఫైనల్ కు చేరారు.