Advertisement

  • తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కరోనాతో మృతి

తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కరోనాతో మృతి

By: chandrasekar Wed, 02 Sept 2020 4:03 PM

తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కరోనాతో మృతి


తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత మాతంగి నర్సయ్య కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందారు. 20 రోజుల క్రితం కరోనా సోకిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.

కానీ, కరోనా లక్షణాలతో పాటు ఇతర అరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మాతంగి నర్సయ్య భార్య జోజమ్మ సైతం 15 రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు కరోనాకు బలవడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన నర్సయ్య.. కొంతకాలం పాటు మంత్రిగానూ సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు.

Tags :
|

Advertisement