మాజీ డిప్యూటీ సీఎం కడియంకు కరోనా పాజిటివ్ ..
By: Sankar Wed, 22 July 2020 1:10 PM
తెలంగాణాలో రాజకీయ నాయకుల మీద కరోనా పంజా విసురుతనే ఉంది ..ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులూ కరోనా బారిన పడ్డారు ...ఎక్కువగా వరంగల్ జిల్లాకు చెందిన నాయకులూ కరోనా బారిన పడ్డారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన కొడుకు, కోడలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు దంపతులకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారు హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు.
తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఆయన హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. కడియంతోపాటు ఆయన గన్మెన్, పీఏకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.తెలంగాణలో ఇప్పటి వరకూ చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కరోనాను జయించారు. హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బిగాల గణేష్, భాస్కర్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కోవిడ్ బారిన పడ్డారు.