రాయుడు ని ఎంపిక చేయకుండా తప్పు చేసాము ...అప్పటి సెలెక్టర్ దేవాంగ్ గాంధీ
By: Sankar Sun, 22 Nov 2020 09:20 AM
గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో అంబటి రాయుడుకు చోటు ఇవ్వకపోవడం తాము చేసిన తప్పిదాల్లో ఒకటని అప్పుడు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. గత సెప్టెంబర్లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత తొలిసారి వరల్డ్కప్ సెలక్షన్పై పెదవి విప్పాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే వరుస చర్చలు కొనసాగుతుండగా, అంబటి రాయుడ్ని వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడాన్ని తమ తప్పిదంగానే దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. ‘ అవును.. అది మా తప్పిదమే. తప్పు జరిగింది. కానీ మేము కూడా మనుషులమే. ఏది సరైన కాంబినేషన్ అనే విషయంలోనే పొరపాటు చేశాం. ఆ కోణంలోనే ఆలోచించాం. ఆ తర్వాత చేసిన పొరపాటు తెలుసుకున్నాం.
భారత జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఇక్కడ రాయుడు లేని లోటు కనిపించింది. కేవలం ఒక్క మ్యాచ్తో టీమిండియా అప్పటివరకూ ఆడింది అంతా పోయింది. సెమీస్ తప్పితే మిగతా టోర్నీ అంతా భారత్ బాగా ఆడింది. ఇక్కడ రాయుడు కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను. అతని రియాక్షన్ను సమర్థించక తప్పదు. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు’ అని దేవాంగ్ గాంధీ తెలిపారు.